Thursday, January 28, 2010

''రాజకీయ నాయకులు తెలంగాణా వాదం అనే తెప్పను ఎక్కి అవసరం తీరిపోగానే తెప్పను తగుల బెట్టేరకంగా తయారవుతున్నారు!'' - చిరంజీవి (జగిత్యాలలో )

.





2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల లో ప్రత్యేక తెలంగాణా అంశంపై తమ పార్టీ స్టాండును వివరిస్తూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ఇది:

.




.

''జగిత్యాలలో నేను చెప్తున్న మాట - మరొక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాను.
ప్రజారాజ్యం ఈ ప్రజల అభిష్టానికి అనుకూలంగా, అనుగుణంగా స్పందిస్తుంది.
సానుకూలంగా వుంటుంది.

నా వెనకాల ప్రజలున్నారు.
నా ఉద్దేశంలో ప్రజాభివృద్ధి చేయాలి.
వాళ్లందరినీ అభివృద్ధి పథం వైపు నడపాలి.
స్వార్థ రాజకీయాలు ఉండకూడదు.
ఇక్కడ అన్ని రకాల వనరులుండి .. వాటిని అనుకూలంగా మనం మలచుకోవాలి.
మన రాష్ట్ర సంపద ఈ ప్రాంత అభివృద్ధి కోసంగా ఈ ప్రాంతం సంపదని పెంపొందించాలి.
అది చివరకు మీ అందరికి లబ్దిచేకూర్చాలి. అందుకని మరొక్కసారి చెప్తున్నాను. మీరు ...

కేంద్రం గనక ప్రతిపాదించి అది ముందుకు తీసుకురావాలి అని మనందరం అడుగుదాం.
కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీమరీ చెప్తున్నాను.
ఇంతకంటే ఇంకేమి ''క్లారిటీ'' కావాలి?
ఇంతకంటే ఇంకేమి చెప్పాలి?
చెప్పండి మీరు. మీరు అడగండి నన్ను.
ప్రజా ప్రతినిధులో, రాజకీయ నాయకులో వాళ్లు కాదు మీరు చెప్పండి.
మీరు ఏమంటే దానికి స్వాగతిస్తాను. దానికి సానుకూలంగా స్పందిస్తాను.
మీ అభీష్టమే నా అభీష్టంగా చెప్తాను.
మీరు చెప్పాలి. మీ మధ్యనుండి అడుగుతున్నాను. చెప్పండి.
(జై తెలంగాణా...జైజై తెలంగాణా నినాదాల హోరు).

నిజంగా మనందరికీ ఆ తెలంగాణా కావాలి అని అందరూ అనుకుంటే గనక
కేంద్రం దగ్గర పెద్ద ''సౌండ్‌'' చేద్దాం.
పెద్ద ''శబ్ధం'' చేద్దాం.
మీ గొంతు అక్కడ వినపడేలాగా చేద్దాం.

కేంద్రం నిర్ణయం ... కేంద్రం నిర్ణయించాలి. అది మీ దాకా చెప్పక - ఇక్కడి వాళ్లేదో చేయడం లేదు ... చేయడం లేదు అంటే ... కేంద్రం నిజంగా -
వాళ్లకి చిత్తశుద్ధి వుంటే ... మన అభీష్టానికి అనుకూలంగా వాళ్లు నిర్ణయం తీసుకుని... వాళ్లు ప్రతిపాదిస్తే గనక మనం సానుకూలంగా స్పందిస్తాం...!
మనం అడ్డుగా వుండం!! మనం స్వాగతిస్తాం!
ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని!
మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!!


అందుకని మరొక్కసారి -
జన సమక్షంలో వుండి ...
జనం మధ్యలో వుండి ...
జగిత్యాల నడిబొడ్డులో వుండి ...
జనం మధ్యలో వుండి ... చెప్తున్నాను....
చిరంజీవి ... ప్రజారాజ్యం కేంద్రం ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితిలో అడ్డుగా వుండదు!
వుండదు!! వుండదు!!!


ఈ రోజున సామాజిక న్యాయం కావాలి !
సామాజిక తెలంగాణా కావాలి !!

ఎక్కడైతే గనక సామాజిక ఉద్యమం మొదలయిందో ఇక్కడ జగిత్యాలలో మళ్లీ చెప్తాను ...
సామాజిక తెలంగాణా రావాలి!
దానికోసం మనందరం పాటుపడదాం!!

మీ అభీష్టాన్ని మనం అక్కడ తెలియజేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నిద్దాం.
కానీ దానికి కావలసింది మీ చేతుల్లో వుంది.
మీరు దానికోసం అత్యధికంగా మన గొంతు అక్కడిదాకా వినిపించేలాగా ఇక్కడి నుంచి మీ ప్రజాభీష్టానికి అనుకూలంగా ప్రజా ప్రతినిధులు కావాలి.
ప్రజా ప్రతినిధుల్ని మీరు ఎన్నుకోండి.
ప్రజారాజ్యంకు అత్యధిక ప్రజా ప్రతినిధుల్ని మీరు ఇవ్వగలిగితే ఆ రకంగా ఢిల్లీ దాకా మనం ప్రతిపాదిద్దాం...!
మీ అభీష్టానికి అనుకూలంగా వుందాం!

కానీ
తుది నిర్ణయం మాత్రం కేంద్రందే!
కేంద్రం దానికి సానుకూలంగా స్పందించాలి!!
కేంద్రం స్పందించి ప్రతిపాదిస్తే మాత్రం
ఈ చిరంజీవి .... మీ చిరంజీవి.... మీ ప్రజారాజ్యం ...
దానిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోదు ...!
అడ్డుకోదు...!!
అడ్డుకోదు...!!! అని చెప్తున్నాను.


కానీ
తమాషా ఏమిటంటే...
రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారు అంటే ... పూర్వం నుంచి వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు అంటే ...
కొంతమంది ఈ తెలంగాణా వాదం అనే ఓడను... తెప్పను ఎక్కి
అవసరం తీరిపోగానే తెప్ప తగలబెట్టే రకంగా తయారవుతున్నారు!!

మరికొంతమంది ఓడ ఎక్కిని తరువాత ఓడ మల్లన్న అంటున్నారు.
ఓడ దిగిన తరువాత బోడి మల్లన్న అంటున్నారు !!


ఇలాంటి అవమానాలకు గురయ్యే కదా మీ ''ఆత్మ గౌరవం'' దెబ్బతింది?!
కనుక- మీ ఆత్మగౌరవానికి ప్రథమ పీట వేస్తాం!
సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణాకి ప్రథమ పీఠం వేస్తాం!!

ప్రజల అభీష్టానికి మేం ... ప్రజారాజ్యం... మన ప్రజారాజ్యం ముందుంటుందని మీ అందిరి సమక్షంలో మళ్లీ మళ్ళీ చెప్తున్నాను.

- - -

... పూర్తి ప్రసంగం వీడియోను ఈ కింది యూట్యూబ్‌ లింక్‌లో చూడవచ్చు.

CHIRANJEEVI'S JAGITYAL SPEECH VIDEO CLIPPING



.

2 comments:

  1. నేను చిన్నప్పటి నుంచీ చిరంజీవి అంటే పడి చచ్చే దాన్ని. అయన సినిమాలు ఒక్కటీ వదిలిపెట్ట కుండా చూచినాను . ముఖ్యముగా టాగూర్ సినిమా చూచిన తరువాత చిరంజీవి వంటి మహోన్నత ఆదర్శ మూర్తి మన దేశానికి ప్రధాన మంత్రి అయితే ఈ అవనీతి కుళ్ళు రాజకీయాలు పటాపంచలై పోతాయి కదా అని ఎన్ని సార్లు అనుకున్నానో లెక్కలేదు . ఆయన రాజకీయాలలో అడుగు పెడుతున్నాడని తెలిసిన రోజునాడు నిజంగా నేనైతే పండుగ చేసుకున్నాను. ఆయన సభలకు హాజరైన అశేష జన వాహిని ని చూసి ఉ పొంగి పోయాను. చిరంజీవే తప్పక ముఖ్యమంత్రి అవుతాడని ఫ్రెండ్స్ తో పందెం కూడా కాసాను. రిజల్ట్స్ వచ్చిన తరువాత చాలా బాధ అనిపించింది. జనం ఆయనకు మోసం చేసారని మంచి అవకాశం వాళ్ళే చేజేతులా మిస్ చేసుకున్నారని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అనగా తెలంగాణా సమస్య పై విద్యార్ధులంతా ఒక ఉప్పెన మాదిరిగా పోరాటం చేస్తున్న ఏంటో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఈ సమయంలో చిరంజీవి తను తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడకుండా తెలంగాణా ప్రజలను మోసం చేయడం బాధ కలిగిస్తున్నది. చిరంజీవి అందరి వాడు కాదు కొందరి వాడు అని తనే చాటుకున్నాడు. టాగూర్ కాదు అందరు రాజకీయ నాయకుల లాంటి ఒక సామాన్య నాయకుడు ఆదర్శాలు ఏమి లేని వాడు అని చాటుకున్నాడు . ఇప్పుడు ఆయన సమైక్యాంద్ర ఉద్యమమే అసలైన ప్రజా ఉద్యమముకానీ తెలంగాణా ఉద్యమము ప్రజా ఉద్యమము కాదని వెక్కిరిస్తుంటే ఒళ్ళు మండి పోతోంది. చిరంజీవి డౌన్ డౌన్!

    ReplyDelete
  2. @Sravanthi,
    Exactly nadi same feeling.Bloody Ba$!!@$

    ReplyDelete