Wednesday, November 9, 2011

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలకు ఆత్మీయ సత్కారం

...


వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థవారు 23 అక్టోబర్‌ 2011 నాడు హైదరాబాద్‌ త్యాగరాయ గాన సభలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్న తెలుగు కవులు, రచయితలు, అనువాదకులను ఘనంగా సత్కరించారు.

నాటి అపూర్వమైన కార్యక్రమంలో అనేకమంది సాహితీ దిగ్గజాలతో కలిసి సత్కారం పొందే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. గత సంవత్సరం ఆగస్టు 20న గోవాలో అసలు అవార్డు అందుకున్నప్పటికంటే ఈ సత్కారం అమితానందాన్ని, మధురానుభూతిని కలిగించింది.

వంగూరి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డా. చిట్టెన్‌ రాజుగారికీ, శ్రీ వంశీ రామరాజు గారికీ, శ్రీమతి తెన్నేటి సుధ  గారికి, మిత్రులు రాంపా, ఆర్‌.వి.రమణ లకూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనాటి కొన్ని ఛాయా చిత్రాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

,,,