Wednesday, April 3, 2013

1948 లో హైదరాబాద్ రాజ్యం పతన మయింది. కానీ ప్రజలు ఓడిపోయారు. ప్రజాకంటకులే గెలిచారు.




1948 లో  హైదరాబాద్ రాజ్యం పతన మయింది.
కానీ ప్రజలు ఓడిపోయారు.
ప్రజాకంటకులే  గెలిచారు.
కిరీటం కోల్పోయినా నిజాం రాజు స్వతంత్ర భారత దేశం లో  రాజ ప్రముఖుడయ్యాడు
దున్నేవాళ్ళు స్వాధీనం చేసుకున్న  భూములన్నీ తిరిగి భూస్వాముల, జమిందార్ల, దోపిడీదార్ల పరమయ్యాయి

కొన్నాళ్ళు హైదరాబాద్ రాష్ట్రం కొద్ది పాటి స్వేచ్చా వాయువులనైనా ఆస్వాదించిందో లేదో ...
1956 లో మళ్ళీ వలసాంధ్ర పెత్తందార్ల  దురాక్రమణకు గురయ్యింది.
తన అస్తిత్వాన్నే కోల్పోయింది
ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడిది, తెలంగాణా ఎక్కడిది అంతా  మాదే అంటున్నారు దురాక్రమణ దార్లు
మీ నీళ్ళు మీకు ఇవ్వం,
మీ నిధులు మీకు దక్కనివ్వం
ఎం చేస్తారో చేసుకోండి అని హూంకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన అన్యాయాలను
మరోసారి పునరావలోకనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ మన ముందుకు వస్తోంది
అప్పటి ఉస్మానాబాద్ కలక్టర్ మహమ్మద్ హైదర్ రాసిన "1948: హైదరాబాద్ పతనం"

ఈ ఆదివారం (7 ఏప్రిల్ 2013) ఉదయం 10 గంటలకు
సారస్వత పరిషత్ హాల్ లో ఈ పుస్తకం పై జరిగే చర్చలో అందరూ పాల్గొనండి

వివరాలకు సంప్రదించండి :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్ నెం. 040 2352 1849
అన్వేషి ఫోన్ నెం. 040 2742 3168

5 comments:

  1. అంటే ఆ రాజ్యంలో ఉన్నప్పుడు హిందువు బ్రతక గలిగాడా స్వతంత్రంగా?

    ఇక రెండవ ప్రశ్న వలస దార్లు కేవలం తెలంగాణానే దొచుకుంటున్నారు అని అన్నారు మరి మిగిలిన ప్రాంతాలను దొచుకోవట్లేదా?

    ReplyDelete
  2. మన గత చరిత్ర గమనిస్తే భారత ఉప ఖండంలో ఎన్నోమార్పులు జరిగాయి, ముఖ్యంగా ఎందఱో రాజుల రాజ్యాలు మారి పోయాయి. కాని హైదరాబాదు, లేదా నిజాం రాజ్యానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడంలో అర్ధం లేదు. దక్షిణ భారత్ లో క్రిష్ణా గోదావరి నదులకటూఇటూ నివసించే తెలుగు ప్రజల ఐక్యతాభావం ఈ రొజుల్లో చాలా ముఖ్యమయిన విషయమని మనం తెలుసుకోవాలి.

    ReplyDelete
  3. అంటే ఆ రాజ్యంలో ఉన్నప్పుడు హిందువు బ్రతక గలిగాడా స్వతంత్రంగా?
    ...........................
    ee prashnaku artham appudu swatantranga ledu kaabatti ippudu kudaa swatantranga unda vaddanaa ?

    ReplyDelete
  4. ఇదో పనికిమాలిన పుస్తకం. ఈ పుస్తకం రాసిన వాన్ని ప్రచురించిన వాన్ని గుడ్డలూడదీసి తన్నాలి

    ReplyDelete
  5. పత్రికల్లో పేరు చూసుకోవాలన్న ఆరాటం చావని ఓ ముసలి కన్‌ఫర్డ్ అయ్యా యస్ పాట్లు.

    ReplyDelete