Sunday, June 19, 2022

Mulkraj Anands First Novel Untouchable Gandhijis Influence

 

 

ముల్క్ రాజ్‌ ఆనంద్‌ తొలి నవల అన్‌టచబుల్‌- గాంధీజీ ప్రభావం

అంటరానితనం హిందూమతానికి ఒక మాయని మచ్చగా భావించేవారు గాంధీజీ. భారత దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలంటే నిమ్నకులాలూ అగ్రకులాలూ అన్న తేడా లేకుండా హిందువులందరినీ ఏకం చేయడం, ముస్లింలకూ హిందువులకూ మధ్య సామరస్యాన్నీ, సహోదరభావాన్నీ పెంపొందించడం చాలా అవసరమని బలంగా నమ్మేవారు. ఈ దృష్ట్యానే ఆయన స్వాతంత్య్రోద్యమానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో అంటరానితనం నిర్మూలనకూ, హిందూ ముస్లిం ఐక్యతకూ అంతటి ప్రాధాన్యత నిచ్చారు.

విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలుగా...ఐదువందలకు పైబడిన సంస్థానాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఒకవిధంగా దుర్బలస్థితిలో వున్న ఆనాటి భారతావనిని గాంధీజీ ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశారు. సత్యాగ్రహం, శాంతి, అహింసలనే తన ఆయుధాలుగా మలచుకున్నారు. పంచములుగా పరిగణించబడుతూ దారుణమైన వివక్షను ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు. వారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించడం, అన్ని రకాల వృత్తుల పట్ల - ముఖ్యంగా పారిశుధ్య పనులపట్ల శ్రమ గౌరవాన్నిపెంపొందించడం,’ ‘ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌ ` సబ్‌కో సన్మతి దే భగవాన్‌అంటూ మతసామరస్య భక్తిభావనను ప్రచారం చేయడం వంటి అనేక కార్యక్రమాలను భారత స్వాతంత్య్రోద్యమంతో జోడిరచి మరీ ముందుకు తీసుకెళ్లారు.

           గాంధీజీ ప్రబోధాలూ, వినూత్నమైన ఆయన ఆలోచనలూ, కార్యాచరణా దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అలా ప్రభావితమైన వారిలో ప్రముఖ రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ (1905-2004) ఒకరు. ఆయన ఇంగ్లీషులో కథలూ కవితలూ రాసేవారు. ఆ రచనలలో ఎక్కువగా సామాన్య ప్రజల జీవితం ప్రతిబింబిస్తుండేది.

గాంధీయిజం పట్ల ఆయనకి విశేషమైన అభిమానం వుండేది. ముఖ్యంగా హిందూ సమాజం నుంచి అంటరానితనం అనే రుగ్మతను పారదోలేందుకు మహాత్ముడు చేస్తున్న కృషి బాగా ఆకట్టుకునేది. అందుకే ఆయన తన తొలి నవలకు అంటరానితనాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. తన సొంత పిన్నికి ఎదురైన ఒక చేదు అనుభవం కూడా ఈ అంశంపై దృష్టి సారించేట్టు చేసింది. అభ్యుదయ భావాలున్న ఆమె ఒకరోజు ఓ ముస్లిం మహిళతో కలసి సహపంక్తి భోజనం చేస్తుంది. దానిని ఆనాటి ఛాందస సమాజం ఘోరమైన నేరంగా పరిగణిస్తుంది. సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమెను మైలపడినట్టు, అంటరానిదైపోయినట్టు బహిష్కరణకు గురిచేస్తారు. అప్పుడామె పడ్డ క్షోభ ఇంతాఅంతా కాదు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ లేని అమానుషమైన అంటరానితనం అనే జబ్బు గురించి, దుర్మార్గమైన కుల వ్యవస్థ గురించి ఏదో ఒకటి రాయకుండా వుండలేని పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి తోడు అంటరానితనం గురించి తన చిన్నప్పటి ఒక అనుభవాన్ని వివరిస్తూ 'యంగ్‌ ఇండియా' పత్రికలో గాంధీజీ రాసిన ఒక వ్యాసం ఆయనను బాగా కదిలిస్తుంది.

గాంధీజీ ఇంట్లో ఊకాఅనే కుర్రవాడు మరుగుదొడ్లు శుభ్రపరిచే పని చేస్తుండేవాడు. అతనితో మాట్లాడినా, పొరపాటున అతడిని తాకినా తల్లిదండ్రులు గట్టిగా మందలించేవారు. మైలపడిపోయినట్టు ప్రాయశ్చితం చేయించేవారు. తమ మరుగుదొడ్లను శుభ్రంచేస్తూ తమకు ఎంతో ఉపకారం చేస్తున్న వ్యక్తితో మాట్లాడితే, అతనిని తాకితే తప్పేమిటో బాలగాంధీకి అర్థమయ్యేది కాదు. ఆ విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో ఘర్షణ పడేవాడు. గాంధీజీ చెప్పిన ఈ ఉదంతం అందులోని ఊకాపాత్రే అన్‌టచబుల్‌ నవలలో ప్రధాన పాత్ర బాఖాకు జీవం పోసింది. నవల రాస్తున్నకాలంలో ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తుండేవారు. తను రాస్తున్న నవల గురించి గాంధీజీకి ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వివరిస్తూ ఆయన సలహాలు తీసుకునేవారు.

అన్‌టచబుల్‌రచన పూర్తయినప్పటికీ గాంధీజీ పలు సూచనలు చేయడంతో ప్రచురణకు వెళ్లకుండా దానిని తిరగరాయాలని నిర్ణయించుకుంటారు. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశం వచ్చాక నేరుగా అహ్మదాబాద్‌లో వున్న గాంధీజీని కలుసుకుంటారు. ఆయన సూచనలకు అనుగుణంగా తన నవలను తిరగరాయాలనుకుంటున్నట్టు చెప్తారు. అందుకుగాను  కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో వుండేందుకు అనుమతి కోరతారు. అందుకు గాంధీజీ అంగీకరించడంతో దాదాపు మూడు నెలల పాటు సబర్మతి ఆశ్రమంలో వుంటారు. ఆశ్రమ నియమాల ప్రకారం ప్రతి రోజూ ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు కడగడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేస్తూ గాంధీజీ ఆదర్శాల ఆచరణను చవిచూస్తారు. 

అయితే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ పట్ల వున్నది గుడ్డి అభిమానం కాదు. ఆయన ప్రధానంగా సోషలిస్టు, నాస్తికుడు. గాంధీజీతో పలు అంశాలలో బేధాభిప్రాయాలు కూడా వుండేవి. అదేసమయంలో మహత్తరమైన ఆయన ఆశయాలను, ఆదర్శాలను, కృషిని ఆరాధించేవారు. అహ్మదాబాద్‌లో తొలిసారి గాంధీజీని ప్రత్యక్షంగా కలిసిన తరువాత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ గాంధీజీతో ఒకరోజుఅన్న శీర్షికతో తమ మధ్య జరిగిన సంభాషణని ముఖాముఖిగా రాశారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సంపాదకత్వంలో 1968లో వెలువడిన ఒక పుస్తకంలో ఆ ముఖాముఖి చోటుచేసుకుంది. విజయవాడ అన్నపూర్ణ పబ్లికేషన్స్‌ వారు గాంధీ మహాత్ముడు నూరేళ్లుఅనే పేరుతో దీనిని 1970లో  తెలుగులో ప్రచురించారు. కాగా పొత్తూరు పుల్లయ్య తెలుగు అనువాదం చేశారు.

           అందులో ఒక చోట గాంధీజీ అస్పృశ్యులు అన్న పదాన్ని వాడకుండా వారిని మేం హరిజనులుఅంటాంఅని అభ్యంతరం చెప్పినప్పుడు ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం. కానీ మన సమాజం వారికి అలాంటి స్థానం ఏమీ ఇవ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా నాకు భగవంతుడి మీద విశ్వాసంలేదుఅని నిర్ద్వంద్వంగా చెప్తారు. అంటే మీరు హిందువులు కాదన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానించగా కాదు. కులవ్యవస్థను సమర్థించే... సహించే మతం మీద నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు కుల వ్యవస్థకు స్థానంలేని క్రైస్తవ మతం స్వీకరిద్దామనుకున్నాను కానీ ఆ మతాన్ని అనుసరించాలన్నా కూడా భగవంతుడి మీద విశ్వాసం వుండాలి కదా అని మానేశానుఅంటారు ముల్క్‌ రాజ్‌. అయితే మీకు నాస్తికుడిని అనిపించుకోవడమే ఇష్టమన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానిస్తే లేదు నేను సోషలిస్టునిఅని అంటారు ముల్క్‌రాజ్‌.

 

 కుల వ్యవస్థను హిందూమతం సమర్థించడంలేదు, సహించడం అంతకన్నా లేదు. కొందరు సనాతనపరాయణులైన హిందువులు కింది కులాల పట్ల వివక్ష చూపుతారు, కానీ సజ్జనులైన హిందువులు మాత్రం ఎన్నడూ వివక్షను ప్రదర్శించరుఅని గాంధీజీ వివరించబోతే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌  మీరు హిందూ మతం పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదిక. ఈ విషయాన్ని మీరు గుర్తించడంలేదుఅని నిర్మొహమాటంగా అంటారు. హిందూ మతానికి కుల వ్యవస్థ ప్రాతిపదిక అయినట్టయితే అలాంటి హిందూమతంతో నాకు సంబంధంలేదుఅని గాంధీజీ అంటారు. అయినా ముల్క్‌రాజ్‌ నేను మాత్రం హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదికని నమ్ముతాను, అందుకే కుల వ్యవస్థకు నిరసనగా ఈ నవల రాశానుఅని నిర్మొహమాటంగా  సమాధానం ఇస్తారు.

     ఈ నవలను ఇంగ్లీషులో రాయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయేమో తప్ప దీనిని సామాన్య ప్రజలు  ఎలా చదివి ఆనందించగలరు?’ అని గాంధీజీ అన్నప్పుడు నేను పంజాబీలో రాస్తే ముద్రించడానికి ఒక్క ప్రచురణకర్త కూడా ముందుకురారు, అందుకే విధి లేక ఇంగ్లీష్‌లో రాస్తున్నాను, అయితే కొందరు భారతదేశంలోని లోపాలను బయటి ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నానంటూ తనని విమర్శిస్తున్నారనివాపోతారు. అప్పుడు గాంధీజీ  ఎవరికి వీలయిన భాషలో వారు రాయడం తప్పుకాదు, ఎవరికి బాధ కలిగించినా లెక్కచేయకుండా సత్యాన్ని చాటిచెప్పాల్సిందే. ఎవరికి నొప్పి కలిగించినా సత్యం సత్యమే అవుతుందిఅంటారు. ఈవిధంగా కొన్ని అంశాలలో విభేదాలు వున్నప్పటికీ ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ ఆలోచనల పట్ల అపారమైన అభిమానం వుండేది.

            సబర్మతి ఆశ్రమంలో సమయం దొరికినప్పుడల్లా తను ఎడిట్‌ చేస్తున్న 'అన్‌టచబుల్‌' నవలను గాంధీజీకి వినిపించేవారు. మన సమాజంనుంచి ఏ రుగ్మతనైతే తాను సమూలంగా నిర్మూలించాలనుకుంటున్నారో ఆ రుగ్మతపై రాసిన రచన కాబట్టి గాంధీజీని అది చాలా ఆకట్టుకుంటుంది. అయితే నవల మధ్యలో కథానాయకుడు బాఖా ప్రేమలో పడటం వంటి సంఘటనలు వుండటం వల్ల అసలు సమస్య అయిన అంటరానితనం పక్కదారి పట్టినట్టు అనిపిస్తోందంటూ పలు సూచనలు చేస్తారు గాంధీజీ. ఆయన సూచనలతో ఏకీభవించిన ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ సబర్మతీ ఆశ్రమంలోనే తన నవలను పూర్తిగా తిరగ రాస్తారు. మొదట మూడు వందల పేజీలకు పైగా వచ్చిన నవల చివరకు 148 పేజీలకు తగ్గిపోతుంది. అయితే రాశి తగ్గినా వాసి పెరిగి అంటరానితనం సమస్యను మరింత బలంగా ప్రొజెక్ట్‌ చేస్తుంది. 1935లో మొదటి ముద్రణ వెలువడ్డ తర్వాత దేశ విదేశాలలో అన్‌టచబుల్‌ పెద్ద సంచలనాన్నే సృష్టించింది. 

(ఆంధ్ర ప్రభ 12 జూన్ 2022)

            ఎ పాసేజ్‌ టు ఇండియావంటి రచనలు చేసిన సుప్రసిద్ధ రచయిత ఇ. ఎం.ఫోర్‌స్టర్‌ (1879-1970)  ముల్ క్ రాజ్ ఆనంద్ రాసిన  అన్ టచ్ బుల్ నవల  కు ముందు రాశారు. ఎంత సానుభూతి వున్నప్పటికీ మరే యురోపియన్‌ రచయితా, చివరకు ఒక అస్పశ్యుడు కూడా ఇలాంటి పుస్తకాన్ని రాయలేడు...  బాఖా లాంటి పాత్రను సృష్టించలేడుఅంటూ ప్రశంసించి ఇంకా ఇలా అన్నారాయన - క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచీ ఇండియన్‌ రెజిమెంట్‌లో అంటరానివాళ్ల పిల్లలతో కలసి ఆడుకోవడం, వారి స్థితిగతులను లోతుగా అర్థంచేసుకోవడం, మంచి దృక్పథాన్ని కలిగివుండటం వల్లనే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఈ పుస్తకాన్ని రాయగలిగారుఅన్నారు. అంటరానివాళ్లది బానిసలకంటే దుర్భరమైన స్థితి. ఎందుకంటే ఒక బానిస ఎప్పుడైనా తన యజమాని నుంచి బయటపడవచ్చు, తను చేసే పని నుంచి బయటపడవచ్చు. చివరికి స్వేచ్ఛా మానవుడిగా కూడా మారిపోవచ్చు. కానీ అంటరానివ్యక్తిది బానిసకంటే హీనమైన పరిస్థితి. అంటరానివాడుగా అతనిపై మతం వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగేది కాదు. జీవితాంతం ఆమాటకొస్తే తరతరాలుగా అతని సంతతి అంతా అంటరానివాళ్లుగా పరిగణించబడుతూ వుండవలసిందే.

ఉత్తర భారత దేశంలోని బులాషా అనే పట్టణంలో సాగుతుందీ నవల. ఇంకా సూటిగా చెప్పాలంటే అక్కడి వెలివాడలో నివసించే బాఖా అనే ఓ పందొమ్మిదేళ్ల పారిశుధ్య పనివాడి జీవితం చుట్టూ తిరుగుతుంది. కేవలం ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాఖాకి ఎదురైన అవమానకరమై, అమానుషమైన, వివక్షాపూరితమైన సంఘటనల సమాహారమే ఈ నవల. అయితే ఇది కేవలం బులాషా పట్టణానికో, బాఖా అనే యువకుడికో సంబంధించినది మాత్రమే కాదు. భారతదేశంలోని ప్రతి పట్టణంలోనూ, అంటరానివారిగా పరిగణించబడే ప్రతి వ్యక్తి జీవితంలోనూ మనకు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి.

నిజానికి ఉత్తర భారతంలో బులాషా అనే పట్టణమే లేదు. అది కేవలం ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఊహాజనితం. ఆయనకు సమకాలికుడూ, ఇండియన్‌ ట్రయోలజీలో ఒకరైన మరో సుప్రసిద్ధ రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ సృష్టించిన మాల్గుడిలాంటి పట్టణమది. అనేక వెలివాడలను స్వయంగా పరిశీలించి, పరితపించి ఎంతో వాస్తవికతతో సృష్టించినది కాబట్టే ఆ పట్టణం, ఆ వెలివాడ మన పక్కనే వున్నట్టు, మనకు ఎంతో సుపరిచితమైనట్టు అనిపిస్తుంది.

ఊరికి దూరంగా కంటోన్మెంట్‌ పక్కన వెలివేసినట్టుంటుంది ఆ వాడ. అక్కడ హిందూ సమాజంలోని అట్టడుగు బహిష్కృత జనం నివసిస్తుంటారు. మట్టితో కట్టిన పూరి గుడిసెలు రెండు వరుసల్లో వుంటాయి. పక్కనే ఓ మురికి కాలువ ప్రవహిస్తుంటుంది. కాలువ గట్టున వివిధ జంతువుల కళేబరాలు, ఆరబెట్టిన జంతు చర్మాలు, గాడిదలు, గుర్రాలు, పశువుల, మనుషుల విసర్జితాలు, చెత్తా చెదారంతో పప్పుడూ చిత్తడి చిత్తడిగా దుర్గంధపూరితంగా వుంటుంది. నిజానికి కేవలం బులాషాలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలోని వెలివాడలన్నింటి పరిస్థితీ ఇంతేకదా.

ఆ పట్టణంలో లాఖా అనే అతను అక్కడి పారిశుద్ధ కార్మికుల, స్వీపర్ల జమేదార్‌. అతనికి ముగ్గురు పిల్లలు. బాఖా, సోహిని, రాఖా. భార్య అర్థంతరంగా చనిపోవడంతో అతనిలో నిర్లిప్తత, బద్ధకం చోటు చేసుకుంటాయి. తను చేయాల్సిన పనులన్నింటినీ పెద్దకొడుకైన బాఖా మీద వేస్తుంటాడు. బాఖా వయసు పందొమ్మిదేళ్లు. అతను కొంతకాలం దగ్గరలోని రెజిమెంట్‌లో పనిచేశాడు. టామీస్‌గా వ్యవహరించబడే బ్రిటిష్‌ సైనిక సిబ్బంది అక్కడ బాఖాని సాటి మనిషిలా చూసేవాళ్లు. అసలు అంటరానితనం అనే జాఢ్యమే అక్కడ కనిపించేదికాదు. బాఖాకు తాను కూడా టామీస్‌లా మంచి దుస్తులు ధరించాలని, గౌరవప్రదమైన జీవనం గడపాలని వుంటుంది. కానీ తండ్రి ఒత్తిడి అతను వల్ల కంటోన్మెంట్‌ వెలుపల పారిశుధ్యపనులు చేస్తూ అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది.

ప్రొద్దున్నే తండ్రి తిట్లదండకంతో బాఖా దినచర్య మొదలవుతుంది. అగ్రవర్ణాల ఇళ్లల్లో మరుగుదొడ్లను శుభ్రంచేసే పనికి అసహనంగానే బయలుదేరతాడు. దారిలో పొరపాటున ఒక అగ్రవర్ణస్తుడిని తాకడంతో అతను బాఖా చెంపఛెళ్లు మనిపిస్తాడు. తనని మైలపరిచావు ఇప్పుడు మళ్లీ ఇంటికి వెళ్లి స్నానం చేయాలని అని కసురుకుంటూ  చెడామడా తిడతాడు. ఆ అవమాన భారంతోనే కొన్ని ఇళ్లలో మరుగుదొడ్లను శుభ్రం చేసి తిరిగి వస్తూ అలసటగా ఒక ఇంటి ముందు కూర్చుంటే. ఆ ఇంటి ఆవిడ గబగబా బయటికి వచ్చి తమ వాకిలిని మైలపరిచావంటూ విరుచుకుపడుతుంది. ఇలా అడుగడుగునా అవమానాలే ఎదురవుతుంటాయి. మలాన్ని ఎత్తిపోసి, శుభ్రం చేసి బాగా అలసిపోతాడు. దాహం వేస్తుంటే ఎవరూ గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వరు. ఇంటికి వస్తే ఇంట్లో అన్నీ ఖాళీ కుండలే వుంటాయి. అతని చెల్లెలు ఇప్పుడే నీళ్లు తెస్తాను వుండన్నయ్యా అంటూ కుండ తీసుకుని ఊరి బావి వద్దకు పరిగెడుతుంది. అక్కడ అంటరానివాళ్లంతా క్యూ కట్టి పరస్పరం దెబ్బలాడుకుంటుంటారు. బావిలోంచి వాళ్లు నేరుగా నీళ్లు తోడుకునేందుకు వీలులేదు. ఎందుకంటే వాళ్లు ముట్టుకుంటే బావి మైలపడిపోతుందట. అగ్రకులస్తులు ఎవరైనా వచ్చి దయతలిచి నీళ్లు తోడిపోసే వరకు దళిత వర్గాలవారు దూరంగా ఎదురుచూస్తూ నిలబడివుండాల్సిందే. సోహిని చేసేదేంలేక మౌనంగా క్యూలో నించుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడి గుడి పూజారి పండిత్‌ కాళీనాథ్‌ వస్తాడు. అతని కన్ను సోహినిపై పడుతుంది. ఆమెను ముందుకు రమ్మని పిలిచి నీళ్లు తోడిపోసి అందుకు ప్రతిగా గుడిలో ఊడ్చేపని వుంది వెంటనే గుడికి రమ్మంటాడు. అన్నయ్యకు నీళ్లిచ్చి వస్తానని చెప్పి వెళ్తుంది సోహిని.

            బాఖా తనకు ఉదయం నుంచి జరిగిన అవమానాలను ఏకరువుపెట్టి ఇకనుంచి లెట్రిన్లు కడిగే పనికి వెళ్లనని తండ్రితో వాదులాటకు దిగుతాడు. అగ్రవర్ణాల వాళ్లందరూ ఒకేలా వుండరనీ, వాళ్లలో కూడా మంచివారు వుంటారని నచ్చచెప్తాడు లాఖా. చిన్నతనంలో చావు బతుకుల్లో వున్న బాఖాని ఒక అగ్రవర్ణ డాక్టరే పైసా తీసుకోకుండా చికిత్సచేసి మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడిన సంఘటనను గుర్తు చేస్తాడు. అంతలో బాఖా అంటూ హవల్దార్‌ చరత్‌ సింగ్‌ పిలుపు వినిపిస్తుంది. కంటోన్మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఆయన బాఖాకు బాగా సుపరిచితుడు. తమ లెట్రిన్‌ని అర్జంట్‌గా శుభ్రం చేయాలని పురమాయిస్తే వాళ్లింటికి వెళ్తాడు. అగ్రవర్ణాలలో కూడా మంచివాళ్లుంటారనేందుకు మరో ఉదాహరణ హవల్దార్‌ చరత్‌సింగ్‌. ఆయన హాకీ క్రీడాకారుడు. బాఖాని అందరిలా అంటరానివాడుగా కాకుండా సాటి మనిషిలా చూస్తాడు. వాళ్లింట్లో దేనినైనా ముట్టుకోవచ్చు. మైలపడిపోవడం అనేది వుండదు. బాఖా పనితీరుకు సంతోషించి అతనికి సరికొత్త హాకీ స్టిక్‌ని బహుమతిగా ఇస్తాడు.

           అక్కడి నుంచి ఇంటికి వస్తుంటే గుడిలో పూజారి పండిత్‌ కాళీనాథ్‌ తన చెల్లెలు సోహినీతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటం, సోహినీ గట్టిగా కేకలుపెడుతుండటం కంటపడుతుంది. పట్టరాని కోపంతో పండిత్‌ కాళీనాథ్‌పై దాడిచేయబోతాడు. సోహినీయే బాఖాను ఆపుతుంది. తప్పు పూజారిదైనా జనమంతా తమనే తప్పు పడతారు, తమ మాటని ఎవరూ పట్టించుకోరు అని ఆమెకు తెలుసు. ఈ అంటరానిపిల్ల తనని మైలపరిచిందిఅంటూ పూజారి అప్పటికే  అరుస్తుంటాడు. బాఖా నిస్సహాయంగా పళ్లు కొరుక్కుంటూ చెల్లెలిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు.

            తరువాత హవల్దార్‌ చరత్‌సింగ్‌ ఇచ్చిన హాకీ స్టిక్‌ పట్టుకుని గ్రౌండ్‌కి  వెళ్తాడు. హాకీ ఆటలో అందరికంటే ఎక్కువ గోల్స్‌ చేస్తాడు. అగ్రవర్ణ పిల్లలు ఈర్ష్యపడతారు. ఇరువర్గాల మధ్య గొడవ అవుతుంది. ఒక అగ్రవర్ణ బాలుడికి దెబ్బతగిలితే బాఖానే అతడిని ఇంటికి తీసుకెళ్లి దిగబెడతాడు. అది చూసి వాళ్ల అమ్మ తమ కొడుకును మైలపరిచావుకదరా అంటూ బాఖాని కసురుకుంటుంది. దాంతో మరింత హతాశుడైపోతాడు. తాను పనిచేసే ఇళ్లల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించేందుకు వెళ్లినప్పుడు ఒక ఇల్లాలు రొట్టె ముక్కను దూరం నుంచి కుక్కకు విసిరేసినట్టు విసిరేస్తుంది. కిందపడ్డ ఆ రొట్టెముక్కని చాలా అవమానభారంతో తీసుకుంటాడు. వీధికుక్కల కంటే హీనమైపోయింది తమ బతుకు అని ఆక్రోశిస్తాడు. క్రిస్టియన్‌ సాల్వేషన్‌ ఆర్మీకి చెందిన కర్నల్‌ హచిన్‌సన్‌ బాఖా పరిస్థితిపట్ల జాలి చూపుతూ అతడిని క్రైస్తవమతం స్వీకరించమని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అంటుంటాడు. ఆయన ఎంత అభిమానం కనబరచినా ఆయన భార్య మాత్రం భాఖాను ఇతర అగ్రవర్ణ స్త్రీల మాదిరిగానే చీదరించుకుంటూ వుంటుంది. హే బ్లాకీఅని హేళనగా సంబోధిస్తూ అవమానిస్తుంటుంది. అందుకే కర్నల్‌ హచిన్‌సన్‌ ప్రతిపాదన బాఖాలో ఎలాంటి స్పందన కలిగించదు.

            ఆరోజు సాయంత్రం స్టేషన్‌ వైపు వెళ్లినప్పుడు తమకు దగ్గరలోని గోల్‌బాగ్‌కు మహాత్మా గాంధీ వస్తున్నారన్న వార్త తెలుస్తుంది. బాఖా ఎంతో ఉత్సాహంగా ఆ సభకు వెళ్తాడు. గాంధీజీని చూసి చాలా ఉత్తేజితుడవుతాడు. గాంధీజీ  ఉపన్యాసమంతా అంటరానితనం నిర్మూలన గురించే సాగుతుంది. బాఖా చాలా ఆసక్తిగా వింటాడు. అతని మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. నిజంగానే అగ్రవర్ణాల వైఖరిలో మార్పు వస్తుందా? ఈ అవమానాలు, అసమానతలు, అవహేళనలు అంతరించిపోతాయా? తాము కూడా సమాజంలలో అందరిలా సగౌరవంగా బతికేరోజు నిజంగానే వస్తుందా? --అని ఆలోచిస్తూ సభనుంచి వెనుతిరుగుతాడు. దేశమంతటా త్వరలో ఫ్లష్‌ టాయ్‌లెట్ల విధానం రాబోతోందని అప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కొందరు చర్చించుకోవడం విని నూతనోత్తేజాన్ని పొందుతాడు. సమస్యపై పాఠకులు తమ దృష్టిని కేంద్రీకరించేలాచేసి పరిష్కారాన్ని సమాజానికే వదిలివేస్తాడు రచయిత.

ఈ నవల వెలువడి దాదాపు తొంభై సంవత్సరాలు అవుతున్నా దీనికింకా ప్రాసంగికత వుంది. ఎందుకంటే  అంటరానితనం ఇవాళ ఆనాటి స్థాయిలో లేకపోవచ్చు కానీ ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. మన సమాజంలో గాంధీజీ ఆశించిన మార్పు ఇంకా రావలసేవుంది.

 (ఆంధ్ర ప్రభ 19 జూన్ 2022)

(డా.నాగసూరి వేణుగోపాల్ గారు ఆంద్ర ప్రభ దినపత్రికలో నిర్వహిస్తున్న “గాంధేయం గాండీవం” కాలం కోసం వారి సూచన మేరకు రాసిన సమీక్ష ఇది. వారికీ ఆంద్ర ప్రభ కీ కృతజ్ఞతలు.)

- ప్రభాకర్‌ మందార

 

 

Monday, June 13, 2022

Mulkraj Anand Novel Untouchable 1



ముల్క్ రాజ్ ఆనంద్ తొలి నవల "అన్ టచబుల్" నవల పై 

గాంధీ ప్రభావం అనే అంశం మీద నేను రాసిన సమీక్షా వ్యాసం 

మొదటి భాగం ఆంధ్ర ప్రభ దినపత్రిక 12-6-2022 ఆదివారం సంచిక లో ... 

ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ తొలి నవల అన్‌టచబుల్‌కు  స్ఫూర్తి ఏమిటి?

 

అంటరానితనం హిందూమతానికి ఒక మాయని మచ్చగా భావించేవారు గాంధీజీ. భారత దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలంటే నిమ్నకులాలూ అగ్రకులాలూ అన్న తేడా లేకుండా హిందువులందరినీ ఏకం చేయడం, ముస్లింలకూ హిందువులకూ మధ్య సామరస్యాన్నీ, సహోదరభావాన్నీ పెంపొందించడం చాలా అవసరమని బలంగా నమ్మేవారు. ఈ దృష్ట్యానే ఆయన స్వాతంత్య్రోద్యమానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో అంటరానితనం నిర్మూలనకూ, హిందూ ముస్లిం ఐక్యతకూ అంతటి ప్రాధాన్యత నిచ్చారు.

విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలుగా...ఐదువందలకు పైబడిన సంస్థానాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఒకవిధంగా దుర్బలస్థితిలో వున్న ఆనాటి భారతావనిని గాంధీజీ ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశారు. సత్యాగ్రహం, శాంతి, అహింసలనే తన ఆయుధాలుగా మలచుకున్నారు. పంచములుగా పరిగణించబడుతూ దారుణమైన వివక్షను ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు. వారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించడం, అన్ని రకాల వృత్తుల పట్ల - ముఖ్యంగా పారిశుధ్య పనులపట్ల శ్రమ గౌరవాన్నిపెంపొందించడం,’ ‘ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌ ` సబ్‌కో సన్మతి దే భగవాన్‌అంటూ మతసామరస్య భక్తిభావనను ప్రచారం చేయడం వంటి అనేక కార్యక్రమాలను భారత స్వాతంత్య్రోద్యమంతో జోడిరచి మరీ ముందుకు తీసుకెళ్లారు.

           గాంధీజీ ప్రబోధాలూ, వినూత్నమైన ఆయన ఆలోచనలూ, కార్యాచరణా దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అలా ప్రభావితమైన వారిలో ప్రముఖ రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ (1905-2004) ఒకరు. ఆయన ఇంగ్లీషులో కథలూ కవితలూ రాసేవారు. ఆ రచనలలో ఎక్కువగా సామాన్య ప్రజల జీవితం ప్రతిబింబిస్తుండేది.

గాంధీయిజం పట్ల ఆయనకి విశేషమైన అభిమానం వుండేది. ముఖ్యంగా హిందూ సమాజం నుంచి అంటరానితనం అనే రుగ్మతను పారదోలేందుకు మహాత్ముడు చేస్తున్న కృషి బాగా ఆకట్టుకునేది. అందుకే ఆయన తన తొలి నవలకు అంటరానితనాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. తన సొంత పిన్నికి ఎదురైన ఒక చేదు అనుభవం కూడా ఈ అంశంపై దృష్టి సారించేట్టు చేసింది. అభ్యుదయ భావాలున్న ఆమె ఒకరోజు ఓ ముస్లిం మహిళతో కలసి సహపంక్తి భోజనం చేస్తుంది. దానిని ఆనాటి ఛాందస సమాజం ఘోరమైన నేరంగా పరిగణిస్తుంది. సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమెను మైలపడినట్టు, అంటరానిదైపోయినట్టు బహిష్కరణకు గురిచేస్తారు. అప్పుడామె పడ్డ క్షోభ ఇంతాఅంతా కాదు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ లేని అమానుషమైన అంటరానితనం అనే జబ్బు గురించి, దుర్మార్గమైన కుల వ్యవస్థ గురించి ఏదో ఒకటి రాయకుండా వుండలేని పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి తోడు అంటరానితనం గురించి తన చిన్నప్పటి ఒక అనుభవాన్ని వివరిస్తూ 'యంగ్‌ ఇండియా' పత్రికలో గాంధీజీ రాసిన ఒక వ్యాసం ఆయనను బాగా కదిలిస్తుంది.

గాంధీజీ ఇంట్లో ఊకాఅనే కుర్రవాడు మరుగుదొడ్లు శుభ్రపరిచే పని చేస్తుండేవాడు. అతనితో మాట్లాడినా, పొరపాటున అతడిని తాకినా తల్లిదండ్రులు గట్టిగా మందలించేవారు. మైలపడిపోయినట్టు ప్రాయశ్చితం చేయించేవారు. తమ మరుగుదొడ్లను శుభ్రంచేస్తూ తమకు ఎంతో ఉపకారం చేస్తున్న వ్యక్తితో మాట్లాడితే, అతనిని తాకితే తప్పేమిటో బాలగాంధీకి అర్థమయ్యేది కాదు. ఆ విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో ఘర్షణ పడేవాడు. గాంధీజీ చెప్పిన ఈ ఉదంతం అందులోని ఊకాపాత్రే అన్‌టచబుల్‌ నవలలో ప్రధాన పాత్ర బాఖాకు జీవం పోసింది. నవల రాస్తున్నకాలంలో ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తుండేవారు. తను రాస్తున్న నవల గురించి గాంధీజీకి ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వివరిస్తూ ఆయన సలహాలు తీసుకునేవారు.

అన్‌టచబుల్‌రచన పూర్తయినప్పటికీ గాంధీజీ పలు సూచనలు చేయడంతో ప్రచురణకు వెళ్లకుండా దానిని తిరగరాయాలని నిర్ణయించుకుంటారు. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశం వచ్చాక నేరుగా అహ్మదాబాద్‌లో వున్న గాంధీజీని కలుసుకుంటారు. ఆయన సూచనలకు అనుగుణంగా తన నవలను తిరగరాయాలనుకుంటున్నట్టు చెప్తారు. అందుకుగాను  కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో వుండేందుకు అనుమతి కోరతారు. అందుకు గాంధీజీ అంగీకరించడంతో దాదాపు మూడు నెలల పాటు సబర్మతి ఆశ్రమంలో వుంటారు. ఆశ్రమ నియమాల ప్రకారం ప్రతి రోజూ ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు కడగడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేస్తూ గాంధీజీ ఆదర్శాల ఆచరణను చవిచూస్తారు. 

అయితే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ పట్ల వున్నది గుడ్డి అభిమానం కాదు. ఆయన ప్రధానంగా సోషలిస్టు, నాస్తికుడు. గాంధీజీతో పలు అంశాలలో బేధాభిప్రాయాలు కూడా వుండేవి. అదేసమయంలో మహత్తరమైన ఆయన ఆశయాలను, ఆదర్శాలను, కృషిని ఆరాధించేవారు. అహ్మదాబాద్‌లో తొలిసారి గాంధీజీని ప్రత్యక్షంగా కలిసిన తరువాత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ గాంధీజీతో ఒకరోజుఅన్న శీర్షికతో తమ మధ్య జరిగిన సంభాషణని ముఖాముఖిగా రాశారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సంపాదకత్వంలో 1968లో వెలువడిన ఒక పుస్తకంలో ఆ ముఖాముఖి చోటుచేసుకుంది. విజయవాడ అన్నపూర్ణ పబ్లికేషన్స్‌ వారు గాంధీ మహాత్ముడు నూరేళ్లుఅనే పేరుతో దీనిని 1970లో  తెలుగులో ప్రచురించారు. కాగా పొత్తూరు పుల్లయ్య తెలుగు అనువాదం చేశారు.

           అందులో ఒక చోట గాంధీజీ అస్పృశ్యులు అన్న పదాన్ని వాడకుండా వారిని మేం హరిజనులుఅంటాంఅని అభ్యంతరం చెప్పినప్పుడు ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం. కానీ మన సమాజం వారికి అలాంటి స్థానం ఏమీ ఇవ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా నాకు భగవంతుడి మీద విశ్వాసంలేదుఅని నిర్ద్వంద్వంగా చెప్తారు. అంటే మీరు హిందువులు కాదన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానించగా కాదు. కులవ్యవస్థను సమర్థించే... సహించే మతం మీద నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు కుల వ్యవస్థకు స్థానంలేని క్రైస్తవ మతం స్వీకరిద్దామనుకున్నాను కానీ ఆ మతాన్ని అనుసరించాలన్నా కూడా భగవంతుడి మీద విశ్వాసం వుండాలి కదా అని మానేశానుఅంటారు ముల్క్‌ రాజ్‌. అయితే మీకు నాస్తికుడిని అనిపించుకోవడమే ఇష్టమన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానిస్తే లేదు నేను సోషలిస్టునిఅని అంటారు ముల్క్‌రాజ్‌.

 

 ‘కుల వ్యవస్థను హిందూమతం సమర్థించడంలేదు, సహించడం అంతకన్నా లేదు. కొందరు సనాతనపరాయణులైన హిందువులు కింది కులాల పట్ల వివక్ష చూపుతారు, కానీ సజ్జనులైన హిందువులు మాత్రం ఎన్నడూ వివక్షను ప్రదర్శించరుఅని గాంధీజీ వివరించబోతే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌  మీరు హిందూ మతం పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదిక. ఈ విషయాన్ని మీరు గుర్తించడంలేదుఅని నిర్మొహమాటంగా అంటారు. హిందూ మతానికి కుల వ్యవస్థ ప్రాతిపదిక అయినట్టయితే అలాంటి హిందూమతంతో నాకు సంబంధంలేదుఅని గాంధీజీ అంటారు. అయినా ముల్క్‌రాజ్‌ నేను మాత్రం హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదికని నమ్ముతాను, అందుకే కుల వ్యవస్థకు నిరసనగా ఈ నవల రాశానుఅని నిర్మొహమాటంగా  సమాధానం ఇస్తారు.

     ‘ఈ నవలను ఇంగ్లీషులో రాయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయేమో తప్ప దీనిని సామాన్య ప్రజలు  ఎలా చదివి ఆనందించగలరు?’ అని గాంధీజీ అన్నప్పుడు నేను పంజాబీలో రాస్తే ముద్రించడానికి ఒక్క ప్రచురణకర్త కూడా ముందుకురారు, అందుకే విధి లేక ఇంగ్లీష్‌లో రాస్తున్నాను, అయితే కొందరు భారతదేశంలోని లోపాలను బయటి ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నానంటూ తనని విమర్శిస్తున్నారనివాపోతారు. అప్పుడు గాంధీజీ  ఎవరికి వీలయిన భాషలో వారు రాయడం తప్పుకాదు, ఎవరికి బాధ కలిగించినా లెక్కచేయకుండా సత్యాన్ని చాటిచెప్పాల్సిందే. ఎవరికి నొప్పి కలిగించినా సత్యం సత్యమే అవుతుందిఅంటారు. ఈవిధంగా కొన్ని అంశాలలో విభేదాలు వున్నప్పటికీ ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ ఆలోచనల పట్ల అపారమైన అభిమానం వుండేది.

            సబర్మతి ఆశ్రమంలో సమయం దొరికినప్పుడల్లా తను ఎడిట్‌ చేస్తున్న 'అన్‌టచబుల్‌' నవలను గాంధీజీకి వినిపించేవారు. మన సమాజంనుంచి ఏ రుగ్మతనైతే తాను సమూలంగా నిర్మూలించాలనుకుంటున్నారో ఆ రుగ్మతపై రాసిన రచన కాబట్టి గాంధీజీని అది చాలా ఆకట్టుకుంటుంది. అయితే నవల మధ్యలో కథానాయకుడు బాఖా ప్రేమలో పడటం వంటి సంఘటనలు వుండటం వల్ల అసలు సమస్య అయిన అంటరానితనం పక్కదారి పట్టినట్టు అనిపిస్తోందంటూ పలు సూచనలు చేస్తారు గాంధీజీ. ఆయన సూచనలతో ఏకీభవించిన ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ సబర్మతీ ఆశ్రమంలోనే తన నవలను పూర్తిగా తిరగ రాస్తారు. మొదట మూడు వందల పేజీలకు పైగా వచ్చిన నవల చివరకు 148 పేజీలకు తగ్గిపోతుంది. అయితే రాశి తగ్గినా వాసి పెరిగి అంటరానితనం సమస్యను మరింత బలంగా ప్రొజెక్ట్‌ చేస్తుంది. 1935లో మొదటి ముద్రణ వెలువడ్డ తర్వాత దేశ విదేశాలలో అన్‌టచబుల్‌ పెద్ద సంచలనాన్నే సృష్టించింది. 

(ముగింపు వచ్చేవారం)

- ప్రభాకర్‌ మందార